Amaravati Seed Access Road Line Clear: అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. మొత్తానికి ఉండవల్లిలో భూసేకరణ సమస్యలు పరిష్కారమయ్యాయి. రైతులు తమ భూములను ఇవ్వడానికి అంగీకరించడంతో, సీఆర్డీఏ అధికారులు వారితో చర్చలు విజయవంతమయ్యాయి. మంత్రి నారా లోకేశ్ సూచనలతో స్థానిక టీడీపీ నేతలు రైతులను ఒప్పించడంతో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు మరింత వేగవంతం కానున్నాయి.