రాజధాని రైతులతో సమావేశమైన సీఎం చంద్రబాబు.. అమరావతి అభివృద్ధికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని డెవలప్ చేయాలంటే 29 గ్రామాల పరిధి సరిపోదని.. ఇంకా భూములు కావాలని తెలిపారు. ఇప్పుడు ఉన్న భూములతో అభివృద్ధి చేస్తే.. అదే కేవలం మున్సిపాలిటీ స్థాయికే పరిమితమవుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరానికి ధీటుగా అమరావతిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి తాను తీసుకునే నిర్ణయాలకు రైతుల మద్దతు కావాలని కోరారు.