అమరావతి రాజధాని నిర్మాణ పనులపై ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. మార్చి 12 నుంచి 15 మధ్య అమరావతి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా టెండర్ల తెరవడంలో ఆలస్యమైందన్న నారాయణ.. ప్రస్తుతం టెండర్లు తెరుస్తున్నట్లు వివరించారు. తొలి దశలో 40 వేల కోట్ల విలువైన పనులు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. రాజధాని నిర్మాణం కోసం ప్రజల పన్నుల నుంచి వచ్చిన ఆదాయం రూపాయి కూడా ఖర్చు చేయమని మంత్రి స్పష్టం చేశారు.