Amaravati Central Secretariat Dpr Ready: ఆంధ్రప్రదేశ్కు కేంద్రం మరో శుభవార్త చెప్పింది. అమరావతిలో రూ.2,534 కోట్లతో కేంద్రం సెంట్రల్ సెక్రటేరియట్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం నివాసాలకు సంబంధించి భారీ నిర్మాణాలను చేపట్టనుంది. ఇప్పటికే కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆమోదం తెలిపారు.. తాజాగా డీపీఆర్ రెడీ చేసి కేంద్ర కేబినెట్కు పంపించారు. త్వరలోనే అమరావతిలో ఏర్పాటు చేయబోయే సెంట్రల్ సెక్రటేరియట్ డీపీఆర్కు, ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ నుంచి గ్రీన్సిగ్నల్ వస్తుందని చెబుతున్నారు.