Amaravati Capital Bill In Parliament: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చట్టబద్ధం చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. 2024 జూన్ 2 నుంచి అమరావతిని అధికారికంగా రాజధానిగా ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్ర హోంశాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరు కేంద్రం పలు శాఖల అభిప్రాయాలను సేకరిస్తోంది. ముందు కేబినెట్ ఆమోదం తెలిపి.. ఆ తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం.