రాజధాని అమరావతి పనుల్లో ఇక వేగం పెరగనుంది. మార్చి 15వ తేదీ నుంచి అమరావతి పనులు మొదలుకానున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో టెండర్ల ఖరారులో ఆలస్యమైంది. అయితే టెండర్లు పిలిచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో మిగతా పనులకు టెండర్లు పిలవనున్నారు. అనంతరం మార్చి 15 నుంచి పనులు ప్రారంభించనున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో 30 వేల మందితో అమరావతి పనులు జరుగుతాయని అధికారులు చెప్తున్నారు. అమరావతి నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.