అమరావతి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. పనుల్లో వేగం పెంచేందుకు మరో రూ. 32,500 కోట్ల నిధుల సమీకరణకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, నాబార్డు, ఎన్ఏబీఎఫ్ఐడీ, ఏపీపీఎఫ్సీల నుంచి రుణాల ద్వారా నిధులు సమకూర్చు కోవాలని సీఆర్డీఏ నిర్ణయించింది. ఇప్పటికే రూ. 26,000 కోట్ల రుణం తీసుకున్న సీఆర్డీఏ.. మరిన్ని నిధుల కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీంతో అమరావతి అభివృద్ధి పనుల్లో వేగం పెరగనుంది.