అమరావతిలో అగ్నిప్రమాదం వెనుక కుట్ర? హోం మంత్రి ఆదేశాలు

2 hours ago 1
ఏపీ రాజధాని అమరావతిలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వెలగపూడిలోని సీడ్ యాక్సిస్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. వెలగపూడి అగ్నిప్రమాదం ఘటనపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత విచారణకు ఆదేశించారు. ఈ అగ్రిప్రమాదం ప్రమాదమా..లేక దీని వెనుక కుట్ర కోణం దాగి ఉందా అనే అంశాలపై విచారణ చేపట్టమని ఆదేశించారు. సమీప పొలం నుంచి మంట వచ్చినట్లు ఎల్‌ అండ్‌ టీ ప్రతినిధులు పోలీసులకు తెలిపారు. అలాగే ఆ పొలంలో గడ్డి పేర్చి నిప్పుపెట్టిన ఆనవాళ్లను అధికారులకు చూపించారు, దీంతో దీని వెనుక కుట్ర ఏమైనా ఉందా కోణంలో దర్యాప్తు జరపనున్నారు.
Read Entire Article