Amaravati Manjeera Hotel Foundation Stone: అమరావతిలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, వరుణ్ గ్రూప్ స్టార్ హోటల్, రూ.275 కోట్లతో మంజీర హోటల్స్ 'హాలిడే ఇన్'కు శంకుస్థాపనలు జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంపై నమ్మకంతో పెట్టుబడులు వస్తున్నాయని యోగానంద్ తెలిపారు. త్వరలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో 12 బ్యాంకుల రాష్ట్ర ప్రధాన కార్యాలయాలకు ఒకేసారి భూమిపూజ చేయనున్నారు. బ్యాంకుల కోసం ఇప్పటికే స్థలాలు కేటాయించారు.