Tirumala Srivari Laddu In All TTD Temples: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను భక్తులందరికీ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు టీటీడీ ఈవో జే శ్యామలరావు. దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాలు సమాచార కేంద్రాలలో లడ్డూ ప్రసాదాలను శాశ్వతంగా విక్రయించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఆయా ఆలయాలలో ఇందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా టీటీడీ ఆలయాలు, సమాచార కేంద్రాల్లో లడ్డూ ప్రసాదాలను అందుబాటులోకి తెచ్చారు.