అమరావతిని 'గ్రీన్ రాజధాని'గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఉద్ధండరాయునిపాలెంలో రూ.75 లక్షలతో సీఆర్డీఏ ఆధ్వర్యంలో అత్యాధునిక ఉద్యాన నర్సరీ, రైతు శిక్షణ కేంద్రం నిర్మిస్తోంది. రోడ్ల పక్కన, డివైడర్ల మధ్యలో, ఉద్యానాలు, ఎల్పీఎస్ లేఔట్లలో ఈ నర్సరీ మొక్కలనే వినియోగించనున్నారు. ఇక ఈ శిక్షణ కేంద్రంలో ఉద్యాన సంబంధిత విషయాలపై నిరుద్యోగులు, రైతు కూలీలకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. దీంతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అధికారులు చెబుతున్నారు.