అమరావతిలో నిరుద్యోగులకు ఉపాధి.. సరికొత్త ఆలోచన..

4 months ago 11
అమరావతిని 'గ్రీన్ రాజధాని'గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఉద్ధండరాయునిపాలెంలో రూ.75 లక్షలతో సీఆర్డీఏ ఆధ్వర్యంలో అత్యాధునిక ఉద్యాన నర్సరీ, రైతు శిక్షణ కేంద్రం నిర్మిస్తోంది. రోడ్ల పక్కన, డివైడర్ల మధ్యలో, ఉద్యానాలు, ఎల్పీఎస్‌ లేఔట్లలో ఈ నర్సరీ మొక్కలనే వినియోగించనున్నారు. ఇక ఈ శిక్షణ కేంద్రంలో ఉద్యాన సంబంధిత విషయాలపై నిరుద్యోగులు, రైతు కూలీలకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. దీంతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అధికారులు చెబుతున్నారు.
Read Entire Article