అమరావతిలో సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 13వ తేదీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సీఆర్డీఏ ఆఫీసు ప్రారంభం కానుంది. ఉదయం 9:54 నిమిషాలకు సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం ప్రారంభోత్సవం జరగనుంది. సీఆర్డీఏ ప్రాజెక్టు ఆఫీసును మొత్తం ఏడు అంతస్తులలో నిర్మించారు. 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో నిర్మాణం ప్రారంభం కాగా.. మధ్యలో అధికారం చేతులు మారటంతో పనుల్లో జాప్యం జరిగింది. ఎట్టకేలకు నిర్మాణం పూర్తి చేసుకున్న సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం.. ప్రారంభోత్సవానికి ముస్తాబైంది.