రాజధాని అమరావతిలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నిర్మాణం దాదాపుగా పూర్తి కావొచ్చింది. వచ్చే ఏడాది మార్చి నాటికి అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో వేగంగా పనులు చేపడుతున్నారు. అమరావతి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నిర్మాణం పూర్తి కావొచ్చిందని.. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. రూ.250 కోట్లతో ఈ నిర్మాణ పనులు చేపట్టారు. ఐదు ఎకరాల్లో అమరావతి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నిర్మాణానికి 2017లో శంకుస్థాపన జరగ్గా.. రాష్ట్రంలో అధికారం మారటంతో తుళ్లూరు ఫోరెన్సిక్ ప్రయోగశాల నిర్మాణం కూడా ఆగిపోయింది.