Andhra Pradesh Amaravati Elevated Corridors: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మే 2న ప్రధాని మోదీ దాదాపు రూ.లక్ష కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రాజధానిలో మూడు ప్రధాన రహదారుల్లో 8 వరుసల ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) డీపీఆర్ తయారీకి టెండర్లను ఆహ్వానించింది. జాతీయ రహదారులతో అనుసంధానిస్తూ ఈ కారిడార్లు హైదరాబాద్లోని పీవీ నరసింహారావు ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్వే తరహాలో ఉంటాయి.