ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ రాజధాని అమరావతిలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఈ క్రమంలోనే అమరావతికి స్టార్ హోటల్ రానుంది. రూ.200 కోట్లతో 4 స్టార్ హోటల్ నిర్మాణానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దసపల్లా అమరావతి హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్కు అనుమతులు ఇస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ఈ హోటల్కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల రాయితీలు, ప్రోత్సాహకాలు అందించనున్నారు.