ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం.. ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే అమరావతిలో రెండో విడత భూ సమీకరణ నిర్ణయం తీసుకుంది. అమరావతి విస్తరణలో భాగంగా 16666 ఎకరాల భూ సమీకరణకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ సిటీ, అమరావతి రైల్వే స్టేషన్ వంటి ప్రాజెక్టులు చేపట్టనున్నారు. వీటి అవసరాల కోసం ఏడు గ్రామాల పరిధిలో మరో 16666 ఎకరాలు సమీకరించనున్నారు.