కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. విజయవాడలో జరిగిన ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో అమిత్ షా పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. జనసేన శ్రేణులు, కార్యకర్తలు ఈ వీడియో వైరల్ చేస్తున్నారు. ఇదీ పవన్ కళ్యాణ్ రేంజ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.