అమీర్పేటలోని మైత్రివనం ఏరియాలో అగ్నిప్రమాదం సంభవించింది. దట్టమైన పొగ కమ్ముకోవడంతో.. బయపడిన విద్యార్థులు మెట్లమార్గంలో నుంచి రావడానికి ధైర్యం చేయలేదు. దీంతో వెనుకనున్న బాల్కనీలోకి రాగా.. నిచ్చెనల ద్వారా వారిని బయటకు తీసుకొచ్చారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు తెలిపారు.