మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో నల్గొండ కోర్టు వెలువరించిన తీర్పుపై అప్పటి జిల్లా ఎస్పీ, ప్రస్తుత హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హర్షం వ్యక్తం చేశారు. తాము ఆనాడు పడిన కష్టానికి ఫలితం దక్కిందన్నారు. ఎట్టకేలకు న్యాయం గెలిచిందని చెప్పారు. అమృతపై అమితమైన ప్రేమతోనే మారుతీరావు ప్రణయ్ను హత్య చేయించినట్లు ఏవీ రంగనాథ్ వెల్లడించారు.