ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన మరో తెలుగు విద్యార్థి ప్రాణం పోయింది. అది కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. గత కొన్ని రోజులుగా అమెరికాలో నెలకొన్న పరిస్థితుల వల్లే ఆ తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఫెడరల్ అధికారుల తనిఖీల్లో భాగంగా తెలుగు విద్యార్థి సాయి కుమార్ రెడ్డి పాస్పోర్ట్ సీజ్ కావటంతో.. తనను కూడా చేతులకు కాళ్లకు సంకేళ్లేసి తిరిగి ఇండియాకు పంపించేస్తారేమోనన్న భయంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని స్నేహితులు చెప్తున్నారు.