ఖమ్మం జిల్లాలో 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సరస్వతమ్మ అనే వృద్ధురాలు పుట్టిన రోజు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు ఆమె కుటుంబ సభ్యులు. 40 ఏళ్ల వయసులోనే భర్త చనిపోయినా.. మొక్కవోని ధైర్యంతో అడుగు ముందుకు వేసి.. కుటంబ పాలన భారాన్ని తన మీద వేసుకున్నారు సరస్వతమ్మ. కష్టపడి పని చేసి.. ఆరుగురు కుమారులు, ఒక కుమార్తెను ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. ఈ క్రమంలో అక్టోబర్ 6, సోమవారం నాడు ఆమె వందో బర్త్ డే సందర్భంగా కుటుంబ సభ్యులంతా కలిసి ఘనంగా వేడుక నిర్వహించారు.