ఆధ్యాత్మికత ముసుగులో హల్చల్ చేసిన లేడీ అఘోరీ అలియాస్ శ్రీనివాస్ అసలు స్వరూపాన్ని అతని మాజీ శిష్యురాలు శ్రీ వర్షిణి బట్టబయలు చేసింది. ఆలయాల సందర్శన, పూజల పేరుతో భక్తులను నమ్మించి.. రోజుకు రూ. 25 వేల నుండి 30 వేల వరకు ఆదాయం గడించేవాడని ఆమె వెల్లడించింది. ఉచిత భోజనం, కారులో పెట్రోల్తో విలాసవంతమైన జీవితం గడుపుతూ.. ఆశ్రమం పేరుతో మోసాలకు పాల్పడేవాడని అతని దైనందిన జీవనశైలిలోని చీకటి కోణాలను ఈ యూట్యాబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది శ్రీ వర్షిణి.