మహిళల్లో అక్షరాస్యతను పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే 100 రోజుల్లో అందరికీ అక్షరాస్యత కల్పించాలంటూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో భాగంగా.. ఆదివారం రోజున ఉల్లాస్ పరీక్షలు నిర్వహించారు. వంద రోజుల బోధన తర్వాత.. మహిళలకు పరీక్షలు పెట్టారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ పరీక్షలు రాసేందుకు అమ్మలు, అమ్మమ్మలు భారీగా తరలి రావడం విశేషం.