చిత్తూరు జిల్లా పోలీసులను ఓ చిన్నారి పెళ్లికూతురు టెన్షన్ పెట్టింది. తిరుపతిలోని బాలికల సంరక్షణ కేంద్రంలో ఉంటున్న ఓ బాలిక.. ఇటీవల కేంద్రం నుంచి పారిపోయింది. ఆరా తీస్తే ఓ యువకుడ్ని పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. దీంతో కేంద్రం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులను బాలికను అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలిస్తే.. చిత్తూరు ఆస్పత్రిలో మహిళా పోలీసు కళ్లుగప్పి బాలిక పరారైంది. చివరకు బెంగళూరులో బాలికను గుర్తించిన పోలీసులు.. మరోసారి ఆస్పత్రికి తరలించారు.