సర్.. నాకు అమ్మానాన్న కావాలి.. నన్ను వారు పట్టించుకోవడం లేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందో బాలిక. ఎనిమిదో తరగతి చదువుతున్న ఆ బాలిక.. తన తల్లిదండ్రులు తనను పట్టించుకోవడం లేదని కంప్లైంట్ చేసింది. పోలీసులు ఆ బాలిక బాధను అర్థం చేసుకుని అమ్మాయి తల్లిదండ్రులను పిలిపించారు. కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇంత జరిగినా.. ఆ అమ్మాయిని తీసుకెళ్లడానికి తల్లిదండ్రులు అంగీకరించలేదు.. దీంతో పోలీసులే విస్తుపోయారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.