Guntur Old Man Loses Rs 1 Crore: గుంటూరుకు చెందిన 68 ఏళ్ల నల్లూరి వెంకటేశ్వర్లు 'హాయ్' అని మెసేజ్ పెట్టడంతో రూ.కోటి పోగొట్టుకున్నారు. శైలజ అనే మహిళ కాల్బాయ్గా వెళ్లమని అడిగింది. ఆయన నిరాకరించినా, ఆమె పదేపదే ఫోన్లు చేస్తూ, అసభ్యంగా చాట్ చేశారని బెదిరించింది. ఆపై ఐటీ అధికారులమని చెప్పి రైస్ మిల్లుపై దాడి చేస్తామని భయపెట్టి, సైబర్ నేరగాళ్లు మొత్తం రూ.1 కోటి వసూలు చేశారు. మోసపోయినట్లు గుర్తించిన వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.