వేరే మహిళతో వివాహేత సంబంధం పెట్టుకున్న జీహెచ్ఎంసీ అధికారిని సొంత భార్య, ఆమె తరపు బంధువులు చితక్కొట్టారు. జీహెచ్ఎంసీ అడ్మిన్లో జాయింట్ కమిషనర్గా పని చేస్తున్న జానకిరామ్ గత కొంత కాలంగా ఉద్యోగం పేరుతో బయటకు వెళ్తూ ఇంటికి సరిగా రావడం లేదు. దీంతో జానకిరామ్పై ఆయన భార్య కళ్యాణి నిఘా పెట్టింది. సీక్రెట్గా తన భర్తను ఫాలో కావటంతో.. జానకిరామ్ అసలు భాగోతం బయటపడింది. ఈ క్రమంలో తనకన్న 20 ఏళ్లు తక్కువ వయసున్న అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని వీరిద్దరు సికింద్రాబాద్ వారాసిగూడలో కాపురం పెట్టినట్టు గుర్తించింది. తాజాగా ఆ అమ్మాయితో జానకిరామ్ రాసలీలల్లో మునిగితేలుతున్న సమయంలో కల్యాణి అక్కడికి తన బంధువులతో కలిసి వెళ్లింది. జానకి రామ్ను అతడి ప్రియురాలిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంని జానకిరామ్తో పాటు సదరు యువతికి దేహశుద్ధి చేశారు. అనంతరం ఇద్దరిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై వారాసిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు.