ప్రస్తుతం అమ్మాయిలే టార్గెట్గా మోసాలు జరుగుతున్నాయని సీనియర్ ఐపీఎస్, హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ముఖ్యంగా పెళ్లి పేరుతో ట్రాప్ జరుగుతోందని.. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రేమ పెళ్లిళ్లకు సిద్ధమైనా..పెద్దలు కుదిర్చిన వివాహాలైనా పెళ్లి పీటలు ఎక్కేవరకు అప్రమత్తంగా ఉండాలని లేదంటే జీవితాలు నాశనం అయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు.