Andhra Pradesh Caravan Tourism: విశాఖపట్నం పర్యాటక రంగానికి కొత్త ఆకర్షణగా 'కారవాన్' వాహనం వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించిన ఈ విలాసవంతమైన వాహనాన్ని శివాజీ అనే వ్యాపారవేత్త రూ.1.4 కోట్లతో సమకూర్చారు. APTDC ఒప్పందంతో అరకు, పాడేరు, లంబసింగి వంటి ప్రాంతాలకు పర్యాటకులను తీసుకెళ్తుంది. స్టార్ హోటల్ సౌకర్యాలతో కూడిన ఈ కారవాన్, విలాసవంతమైన పర్యాటకాన్ని సామాన్యులకు అందుబాటులోకి తేవడమే లక్ష్యం. త్వరలో కారివాన్ ప్యాకేజీ వివరాలు ప్రకటిస్తారు.