ఏపీలో అరటి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ధరలు తగ్గిపోవటంతో నష్టాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలలో అరటి సాగు ఎక్కువగా జరుగుతోంది. దీంతో ఆ ప్రాంత రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం నారా చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. అరటి రైతులను ఆదుకునేందుకు అరటిని ఇతర ప్రాంతాలలోని మార్కెట్లకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కలకత్తా, ముంబై లాంటి మార్కెట్లకు అరటిని పంపించి.. విక్రయించాలని అధికారులను ఆదేశించారు.