జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద కేసు నమోదైంది. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాలతో రైల్వే కోడూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు మహిళ లైంగిక వేధింపుల ఆరోపణల విషయంలో అరవ శ్రీధర్ స్పందించారు. విలేకర్లతో మాట్లాడిన ఎమ్మెల్యే.. ఇది తన వ్యక్తిగత విషయమని.. పార్టీకి ముడిపెట్టవద్దని కోరారు. ఈ అంశంలో తన వాదనను ఆధారాలతో సహా కమిటీని అందించానని.. కమిటీ నిర్ణయం మేరకు నడుచుకుంటానని స్పష్టం చేశారు.