ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అంశం హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలోనే ఆరోపణలు చేసిన మహిళ మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని ఆరోపణలు చేశారు. అరవ శ్రీధర్ గురించి తిరుపతి ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేయడానికి వెళ్తే తీసుకోలేదని ఆరోపించారు. దీంతో సంక్రాంతి పండుగకు వచ్చినప్పుడు నారావారిపల్లెలో చంద్రబాబుకు అర్జీ ఇచ్చానని.. అన్ని అర్జీలలాగే తనకూ గ్రీవెన్స్ నంబర్ ఇచ్చారని చెప్పుకొచ్చారు.