దక్షిణాది అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయం అరుదైన ఘనత సాధించింది. ఆలయం ప్రతిష్టాత్మక ఐఎస్ఓ గుర్తింపు పొందింది. ఆహార భద్రత, ప్రసాదాల తయారీ, నిర్వహణ వంటి అంశాల్లో అత్యుత్తమ ప్రమాణాలు పాటించినందుకు గాను ఈ గుర్తింపు లభించింది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దేవస్థానం ఈవోకు మంగళవారం నాడు హైదరాబాద్లో ఐఎస్ఓ సర్టిఫికెట్లను అందజేశారు. ఇది భక్తులకు మరింత విశ్వాసాన్ని పెంచుతుందని అంటున్నారు. దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.