ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు వైసీపీ మహిళా నేతలు సవాల్ విసిరారు. డీఎస్సీలో అక్రమాలు, అవినీతిపై చర్చించేందుకు సిద్ధమని ప్రకటించారు. లోకేష్తో చర్చకు జగన్ అవసరం లేదని.. తాము చాలంటూ వైసీపీ నేతలు శ్యామల, లక్ష్మీపార్వతి, నాగమణి, నాగమల్లేశ్వరి, మంజరీచౌదరి ఛాలెంజ్ చేశారు. జగన్ స్థాయి లోకేష్కు లేదని.. దమ్ముంటే తమతో చర్చకు రావాలని తాడేపల్లి భరతమాత విగ్రహం వద్ద నుంచి సవాల్ విసిరారు.