తూర్పుగోదావరి జిల్లా గాదరాడ ఓం శివశక్తి పీఠంలో సేవ చేయడానికి అర్చక స్వాములు కావాలంటూ జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రకటన ఇచ్చారు. నెలకు రూ.20 వేలు గౌరవ వేతనంతో పాటుగా, డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆసక్తిగలవారు తమ వివరాలు పంపించాలంటూ ఫోన్ నంబర్, మెయిల్ కూడా జతచేస్తూ ట్వీట్ చేశారు. ఈ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.