కృష్ణా జిల్లా పెనమలూరులో డీజిల్ దొంగలు రెచ్చిపోయారు. పెనమలూరు హైస్కూల్ సర్కిల్ వద్ద నిలిపి ఉంచిన బస్సులలో నుంచి డీజిల్ చోరీ చేశారు. నాలుగు సిటీ ఆర్టీసీ బస్సులతో పాటుగా.. ఓ స్కూల్ బస్సులోని డీజిల్ను సైతం ఇలాగే రాత్రి పూట వచ్చి మాయం చేసినట్లు అనుమానిస్తున్నారు. కారులో వచ్చి ట్యూబుల ద్వారా డీజిల్ చోరీ చేసి పారిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. సీసీ ఫుటేజీ సాయంతో దొంగలను కనిపెట్టే పనిలో ఉన్నారు.