తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని ఓ ఆలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మల్లయ్యపల్లిలోని ఆలయంలోకి కొంతమంది దుండగులు నిప్పు విసిరారు. దీంతో ఆలయంలోని దేవుళ్ల చిత్రపటాలు కాలిపోయాయి. ఉదయాన్నే ఈ సంగతిని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. మరోవైపు ఇది కావాలని చేశారా లేదా ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.