తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు విడతల్లో లక్షన్నర వరకు రైతు రుణాలు మాఫీ చేశారు. అయితే కొందరు రైతులకు అర్హతలు ఉన్నా.. రైతు రుణమాఫీ జరగలేదు. దీంతో ఆయా రైతులు ఆందోళనకు గురువుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్న్యూస్ చెప్పారు. అర్హులైనా రైతు రుణమాఫీ కాని రైతులకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మాఫీ వర్తించేలా చేస్తామన్నారు.