కామారెడ్డిలో చిన్నారుల అదృశ్యం ఘటనలు కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలో ఐదుమంది చిన్నారులు కనిపించకుండా పోవటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అదృశ్యమైన వాళ్ళంతా పదేళ్లలోపు పిల్లలే కావటం గమనార్హం. సింహాద్రి, కోదండ విజయ్ అనే ఇద్దరు చిన్నారులు శుక్రవారం నుంచి కనిపించకపోగా.. శనివారం మరో ముగ్గురు చిన్నారులు కనిపించకుండాపోయారు. ముగ్గురు అక్కాచెల్లెళ్లు శనివారం ఉదయం నుంచి కనిపించకుండా పోయారు. ఈ మేరకు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.