మావోయిస్టుల లొంగుబాటు అంశంలో తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏకంగా 130 మంది మావోయిస్టులు ఒకేసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట శనివారం లొంగిపోయారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో తమ ఆయుధాలను అప్పగించారు. మరోవైపు లొంగిపోయిన మావోయిస్టులకు వారి కేడర్ ఆధారంగా ప్రభుత్వం రివార్డు అందించే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లొంగిపోయినవారికి ఎంతమేరకు నగదు బహుమతి లభించే అవకాశం ఉందో చూద్దాం.