అలయ్ బలయ్ కార్యక్రమంలో నాగార్జున.. ‘నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు’

4 months ago 7
దసరా పండుగ మరుసటి రోజు తెలంగాణలో అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తారు. బీజేపీ సీనియర్ నేత బండారు దత్తత్రేయ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి.. ఏళ్ల నుంచి కొనసాగిస్తున్నారు. అలానే ఈ సంవత్సరం కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ‘అలయ్‌ బలయ్‌’ జరిగింది. ఈ కార్యక్రమానికి తలంగాణ గవర్నర్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి కోమటిరెడ్డితో పాటు మరి కొందరు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. వీరితో పాటుగా సినీ నటులు నాగార్జున, బ్రహ్మానందం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ..ఈ వేడుకకు తనను కూడా ఆహ్వానించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తాను ఇలాంటి సత్కారం చేయించుకోవడం ఇదే మొదటి సారి అని నాగార్జున తెలిపారు. అన్ని రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని.. ఇంత మంది ఒకే వేదిక మీదకు రావడం తమకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నబండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మికి అభినందనలు తెలిపారు.
Read Entire Article