విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డుపై బండరాళ్ల పడే ప్రమాదం ఉండటంతో ముందుగానే రాకపోకలు నిలిపివేశారు. భక్తులు మెట్లమార్గం లేదా లిఫ్ట్ ద్వారా వెళ్లాలని సూచించారు. ఆషాఢమాసం సారె మహోత్సవం ముగింపు సందర్భంగా దుర్గమ్మకు భక్తులు భారీగా సారె సమర్పించారు. ఉత్తరాంధ్రలో భారీ వర్ష సూచన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. వరదల కారణంగా పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచి, పంట పొలాలు నీట మునిగాయి.