గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయగా, పార్టీ దాన్ని ఆమోదించింది. అయితే ఎమ్మెల్యే పదవికి మాత్రం ఆయన రాజీనామా చేయలేదు. కమలం గుర్తుపై గెలిచాను కాబట్టి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని ముందు ప్రకటించినా.. రాజాసింగ్ ఆ పని మాత్రం చేయలేదు. తాజాగా రాజీనామా అంశంపై కీలక కామెంట్స్ చేశారు. అధిష్టానం ఆదేశిస్తేనే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేసారు. చివరి శ్వాస వరకు హిందుత్వం కోసం పోరాడుతానని తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఆయన తిరిగి బీజేపీలోకి వచ్చే సంకేతాలని విశ్లేషకులు భావిస్తున్నారు.