TDP Chief Chandrababu Warning To MLAs: టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2029 ఎన్నికలే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పనితీరు మెరుగుపరచుకోవాలని ఎమ్మెల్యేలు, ఎంపీలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజల్లో ప్రభుత్వ పథకాలను వివరించాలని, సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పనితీరు బాగోని నేతలకు గుడ్ బై చెప్పేస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. అనవసరంగా విదేశీ పర్యటనలు వద్దని.. స్తానికంగా అందుబాటులో ఉండాలని సూచించారు.