అలాంటి వారి తాట తీస్తాం.. చంద్రబాబు వార్నింగ్..

1 year ago 16
రాజకీయాల ముసుగులో నేరాలు చేస్తే ఊరుకునేది లేదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో రౌడీయిజానికి తావు లేదన్న చంద్రబాబు.. అలాంటి వారు రాష్ట్రం నుంచి పారిపోవలసిందేనని స్పష్టం చేశారు. అసెంబ్లీలో శాంతి భద్రతల అంశంపై చంద్రబాబు మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో పార్టీ కార్యాలయాలపై దాడులు ఎప్పుడూ చూడలేదన్న ఆయన.. వైసీపీ హయాంలో ఇలాంటి ఘటనలు జరిగాయన్నారు. శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తే ఉపేక్షించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. తన జీవితంలో రాజకీయ కక్షలు ఉండవని స్పష్టం చేశారు.గత ఐదేళ్లలో అసెంబ్లీలో బూతులు మాత్రమే విన్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. సోషల్​మీడియాలోనూ రెచ్చిపోయారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో బూతులు లేవని.. ప్రజా సమస్యలపైనే చర్చ జరుగుతోందన్నారు.
Read Entire Article