ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూరియా సహా ఎరువుల అక్రమ నిల్వ, సరఫరాకు పాల్పడేవారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని భావిస్తోంది. ఈ విషయాన్ని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఎరువులు లభ్యత, సరఫరాపై సమీక్ష నిర్వహించిన ఆయన.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. వైసీపీ తప్పుడు ప్రచారం నమ్మవద్దని కోరారు. అందుబాటులో యూరియా ఉందని.. కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.