Pawan Kalyan Letter To Waqf Board On Nellore Daragh Issue: నెల్లూరు జిల్లాలోని ఏఎస్పేట దర్గా నిర్వహణ బాధ్యతలకు సంబంధించిన అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వక్ఫ్ బోర్డుకు లేఖ పంపారు. ఈ దర్గా నిర్వహణలో జరుగుతున్న పరిణామాలపై లేఖలో ప్రస్తావించారు. ఆ దర్గా బాధ్యతలు అప్పగించాలనుకుంటున్న వ్యక్తిపై పోక్సో కేసు పెండింగ్ ఉందన్న అంశాన్ని ప్రస్తావించారు. దర్గా పవిత్రతను కాపాడేలా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.