అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం తరువాత, అక్కాచెల్లెళ్లు ఏం చేయబోతున్నారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే ఈ సస్పెన్స్కు తెరదించారు రమ్య కంచర్ల. వీడియో ద్వారా 'రమ్య మోక్ష పికిల్స్' పేరుతో మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టనున్నట్లు రమ్య కంచర్ల ప్రకటించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి కొత్త వ్యూహాలతో ముందుకు సాగాలని చూస్తున్నారు. మరి ఈ కొత్త ప్రయాణం ఎలా ఉండబోతుందో చూడాలి. అయితే కొత్త వ్యాపారంలో అలేఖ్యను ఇన్వాల్స్ చేయమని రమ్య కంచర్ల చెప్పడం విశేషం.