బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇప్పటికే తెలంగాణలో వర్షాలు మెుదలు కాగా.. నేడు, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు.