Son Killed Parents In Alluri District: అల్లూరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తల్లిదండ్రులను నరికి చంపాడో కొడుకు. డబ్బులు ఇవ్వలేదనే కోపంతో గొడ్డలితో నరికి చంపాడు. అయితే మద్యం మత్తులో ఈ హత్య చేసినట్లు తెలిసింది. మల్లిరెడ్డి అనే వ్యక్తి తన తల్లిదండ్రులైన సన్యాసిరెడ్డి, బోడెమ్మలపై గొడ్డలితో దాడి చేయటంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే మల్లిరెడ్డికి మానసిక స్థితి సరిగా లేదని స్థానికులు చెప్తున్నారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.